రైతుబంధుకి ఇవ్వాల్సిన నిధులలోంచే..రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతున్నారు : కేటీఆర్

-

రుణమాఫీ పేరిట మరోసారి రాష్ట్ర రైతులను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. గురువారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.రైతుబంధు కింద జూన్ లో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని , హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

40 లక్షల కంటే ఎక్కువ రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అంటూ నిలదీశారు. 2014లోనే కేసీఆర్ ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందని అన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని తెలిపారు.కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలని ,అర్హులందరి రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version