వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్ ప్రదానం

-

దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల కార్యక్రమంలో అట్టహాసంగా కొనసాగుతోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. భారత దేశంలో రెండో అత్యున్నతమైన ఈ పురస్కారాన్ని ఆయన రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు వెంకయ్య నాయుడు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూ వచ్చిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవి వరకు ఎదిగారు.

కాగా, రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.వెంకయ్యనాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి కి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ కేంద్రం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news