సంచలనం; శ్రీకాకుళంలో పాకిస్తాన్ గూడచారి అరెస్ట్

-

శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేగింది. పాకిస్తాన్ గూడచారి సంస్థ ఏజెంట్ మహ్మద్ అష్రఫ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకపాలెం టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేపట్టగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసారు. అతనితో పాటుగా మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ మీద శ్రీకాకుళ౦ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను శ్రీకాకుళం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్తాన్ అధికారులు, తమ చెరలో ఉన్న శ్రీకాకుళంకి చెందిన జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళను విడుదల చేసి వారం కూడా కాక ముందే,

పోలీసులు శ్రీకాకుళంలో పాకిస్తాన్ ఏజెంట్ ని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అసలు అతను ఎందుకు వచ్చాడు అనేది అనుమానాస్పదంగా మారింది. ప్రస్తుతం అతన్ని కేంద్ర బలగాలకు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news