పాకిస్థాన్ లో దారుణం… దైవదూషణ నెపంతో శ్రీలంక జాతీయుడి శరీరాన్నితగలబెట్టి దారుణ హత్య

-

పాకిస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. దైవ దూషణ నెపంతో ఓ వ్యక్తిని కిరాతకంగా చంపారు ఆందోళనకారుల గుంపు. ఈ ఘటన సియాల్ కోట్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇది వరకు పాకిస్థాన్ లో ఇటువంటి ఘటనలే చోటు చేసున్నాయి. దైవదూషణ పేరిట అతివాద ర్యాడికల్ గ్రూపులు ఇలానే పలువురిని చంపాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఒక వ్యక్తిని చిత్రహింసలు పెట్టి అతని శరీరాన్ని తగలబెట్టి చంపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను సియాల్ కోట్ కు పంపించారు. బాధితున్ని స్థానికంగా ఓ ప్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయుడిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో పాకిస్థాన్ లో వైరల్ గా మారింది.

అయితే ఈఘటనపై పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ ఈ ఘటనను “చాలా విషాదం”గా అభివర్ణించారు. ఈఘటనపై విచారణ జరిపి.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. అయితే ఓ నివేదిక ప్రకారం పాకిస్థాన్ లో 1987 నుండి నేటి వరకు హిందువులు, క్రైస్తవులు, షియా మరియు అహ్మదీయా ముస్లింలు వంటి మతపరమైన మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version