మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టు రాజకీయాలు చేసారు-పాల్వాయి స్రవంతి

-

మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొవర్టు రాజకీయాలు చేసారని… అధిష్టానం ఈవిషయాన్ని గుర్తించిందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. వారిపై చర్యలు ఉంటాయీ అన్న విశ్వాసం నాకు ఉందని వెల్లడించారు. ఇవాళ మునుగోడులోని చండూరు మండలం ఇడికుడ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్ నిర్వహించారు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

రెండు పార్టీలు దన బలంతో, మద్యం పంచి, ప్రలోబాలకు గురిచేసి, బెదిరించి ఎన్నికలు నిర్వహించారని ఆగ్రహించారు. సిఎం ను కలిసినట్లు ఫొటో మార్ఫింగ్ చేసి నన్ను ఓడించే ప్రయత్నం చేసారన్నారు. బీజేపి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారు..చివరకు ఓటర్లను కల్తీ మద్యం పంచి వారీ ఆరోగ్యంతో చెలగాటం ఆడారని నిప్పులు చెరిగారు. ఉప ఎన్నిక ప్రజల కోసం జరగలేదని.. ఎన్నికల కమిషన్ కూడా తన విధిని సక్రమంగా నిర్వహించలేదని వెల్లడించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా వుంటానన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version