2022 చివరిలో ఏపీ ప్రభుత్వానికి ప్రమాదం తప్పదు : పరిపూర్ణనందా స్వామిజీ

-

ఏపీ ప్రభుత్వంపై పరిపూర్ణనందా స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో నేను అడుగు పెట్టాను.. బండి కదిలిందని.. ఇప్పుడు నేను ఏపీలో అడుగు పెట్టాను.. ఇక్కడ కూడా సోము వీర్రాజు బండి కదులుతుందని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు తెలియక ఫ్యాన్ స్పీడును 151కు పెంచేశారని…ఎప్పుడైనా ఈ ఫ్యాన్ పడిపోవడం ఖాయమని వెల్లడించారు. పెరుగుట విరుగుట కొరకేనని… హిందువునని నమ్మించి ఓట్లేయించుకున్నారని ఆగ్రహించారు.

ఏపీలో చంద్రబాబు-జగన్ ఇద్దరూ చారిత్రాక తప్పిదాలు చేశారని ఫైర్‌ అయ్యారు. 2022 చివరికో.. 2023 ఆదిలోనో ఏపీ ప్రభుత్వం ఏమవుతుందో నేనైతే చెప్పననని.. ప్రమాదం మాత్రం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణలో కంటే ఏపీలోనే కాషాయ జెండా ఎగరేయడం ఖాయమేమోననిపిస్తోందని… ఏపీలో కమలం వికాసించాలన్నారు. ఒవైసీని మోడీ-యోగి కలిసి బ్యాండ్ బజాయిస్తారని.. ఒవైసీ బ్యాండ్ బజాయించడానికి యూపీ నుంచి యోగి హైదరాబాద్ వరకు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ-యోగిని చూసి ఒవైసీ పారిపోవడం ఖాయమని.. మందిరాలను నిర్మించడమే కాదు.. గుడిశెలను భవనాలుగా కూడా బీజేపీ మార్చగలదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version