ఘోర ప్రమాదం.. ప్యాసింజర్ రైలు, గూడ్స్​ ట్రైన్​ ఢీ.. 12 మంది దుర్మరణం

-

గ్రీస్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్​ ట్రైన్​ ఎదురుగా వస్తున్న మరో గూడ్స్​ రైలును ఢీ కొట్టింది. దీంతో రెండు రైళ్లలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Smoke rises from trains as firefighters and rescuers operate after a collision near Larissa city, Greece, early Wednesday, March 1, 2023. The collision between a freight and passenger train occurred near Tempe, some 380 kilometers (235 miles) north of Athens, and resulted in the derailment of several train cars. (AP Photo/Vaggelis Kousioras)

బుధవారం తెల్లవారుజామున ఏథెన్స్​కు 380 కిలోమీటర్లు దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో రెండు రైళ్లు పట్టాలు తప్పాయి. దాదాపు మూడు బోగీలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు ఘటనాస్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version