సీఎం జగన్ ఓ పిరికి సన్నాసి..నీకు కరెక్ట్‌ మొగుడు లోకేషే – పట్టాభి

-

సీఎం జగన్ ఓ పిరికి సన్నాసి..నీకు కరెక్ట్‌ మొగుడు లోకేషే అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పట్టాభి. జగన్ యూజ్ లెస్ ఫెలోలా వ్యవహరిస్తున్నారని.. చంద్రబాబుకు పెరుగుతోన్న ఆదరణ చూసి జగన్ సైకోలా మారుతున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. టీడీపీ బీసీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది… ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా అయ్యన్న ప్రజల పక్షాన నిలిచారన్నారు.

అయ్యన్న స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చింది…మచ్చ లేని వ్యక్తి అయ్యన్న కబ్జా చేశారంటారా..? అని నిప్పులు చెరిగారు. 2019లో ఇరిగేషన్ శాఖ అయ్యన్న ఇంటి నిర్మాణానికి ఇచ్చిన ఎన్ఓసీ సంగతేంటీ..? కేవలం 0.2 సెంట్లు ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో అయ్యన్న ఇంటి గోడ పగులకొడతారా..? జగన్ చరిత్ర.. జగన్ తాత చరిత్ర కబ్జాతోనే మొదలైందని ఆరోపించారు.

బీసీని పొట్టపెట్టుకుని వైఎస్ ఫ్యామ్లీ చరిత్ర మొదలైంది.. .జింకా వెంకట నరసయ్య అనే బీసీ వ్యక్తికి చెందిన గనులను కబ్జా చేయలేదా..? అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్సులో జగన్ పిరికి సన్నాసిలా దాక్కున్నారు… జగనుకు.. వైసీపీ నేతలకు సరైన మొగుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. జగనుది చీకటి బతుకు. అర్థరాత్రుళ్లు పోలీసు బలగాలను పంపుతారా..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version