అప్పటికీ ఇప్పటికీ తేడా ఇదే: పవన్ కళ్యాణ్

-

జనసేన పార్టీని 150 మందితో స్టార్ట్ చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. జనసేన ఆవిర్భావం ఆవశ్యకత ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద పార్టీ శ్రేణులకు వివరించారు. ఆరు లక్షల 50 వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని పవన్ చెప్పారు కామన్ ప్రొటెక్షన్ పెట్టిన రోజు ఎవరైతే తనతో ఉన్నారో వాళ్లంతా ఇప్పుడు జనసేనకి మూల స్తంభాలా ఉన్నారన్నారు. ఒక లక్ష్యం కోసం పార్టీ పెట్టానని ఒక ఓటమితో శూన్యం అనిపించిందన్నారు.

చట్టాలు ప్రతి ఒక్కరు చెప్పారని కానీ ఎవరూ పాటించరు అని అన్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత క్రూరత్వంగా ఉంటారని అనిపిస్తుందని పవన్ అన్నారు. రాజకీయాల్లో అధికారం కోసం రాలేదని మార్పు కోసమే వచ్చానన్నారు. బద్ధకస్తుడిని కాదని చెప్పేందుకే తాను సినిమాల్లోకి వెళ్లానని పవన్ కళ్యాణ్ అన్నారు రాజకీయాల్లోకి వెళ్తే తన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది అన్నారని ఆయన అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news