పవన్ కళ్యాణ్ వేరు, జనసేన వేరు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేనాని..!

-

పవన్ కళ్యాణ్ వేరు, జనసేన వేరు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. నన్ను గాల్లో, కార్లో  రాకుండా అన్ని రకాలుగా అడ్డుకున్నారు వైసీపీ నేతలు. పాలిటిక్స్ మీద నా ఆలోచనలు చెప్పేందుకు సత్యాగ్రహి సినిమా చేద్దాం అనుకున్నాను. నాకు బలం లేదని నాకు తెలుసు అన్నారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రెండు వేర్వేరు అన్నారు. ఈ రెండు కలపటానికి నాకు సమయం కావాలి. ఇందుకే నేను 25 ఏళ్లు కావాలని చెప్పాను. నేను రాజకీయాల్లోకి నా అభిమానుల కోసం రాలేదు. కష్టాల్లో ఉన్న వారి కోసం వచ్చాను. నేను సినిమాలు చేసుకుందామని అనుకుంటే నా సినిమా
ఇంటర్ నెట్ లో రిలీజ్ చేశారు. 2 ఎంపీలు, 10 ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో వేస్తే జన సేన పార్టీకి గుర్తింపు వచ్చేది. నాపై అభిమానం ఉన్న వారికి తగ్గటం నచ్చదు. కానీ తగ్గటం అవసరం..తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప నాశనం అవ్వమని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news