జన్మభూమిలో జనసేనాని..

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘సేనానితో రైలు ప్రయాణం’ విజయవంతంగా కొనసాగుతోంది… మరి కొద్ది సేపట్లో ఆయన తుని చేరుకోనున్నారు. విజయవాడలో జన్మభూమి రైలులో ప్రయాణం ప్రారంభించిన జనసేనాని.. నూజివీడు, ఏలూరు, తాడేప‌ల్లిగూడెం, రాజ‌మండ్రి, సామ‌ర్లకోట‌,అన్నవరం స్టేష‌న్లోని వారితో పవన్ మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.. పవన్ రైలు ప్రయాణం సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు రైల్వే స్టేషన్లలో అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు అభివాదాలు చేస్తున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం జన్మభూమి రైలు సమయం కంటే ముందుగానే అక్కడి చేరుకున్న ఆయన రైల్వే కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను పవన్ శాలువాలతో సన్మానించారు. పవన్‌ వెంట జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, తోట చంద్రశేఖర్‌, మాదాసు గంగాధరం, జనసైనికులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news