మేడారం జాతర.. పవన్ కళ్యాణ్ స్పెషల్ నోట్..!

-

మేడారం జాతర బుధవారం నుండి ఘనంగా మొదలైంది ఇప్పటికే అధికారులు జాతరకి అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరపై హీరో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ నోటు రాశారు. ఆసియా లో అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళా గా పేరు గాంచిన ఈ జాతర మొదలవుతున్న శుభ తరుణాన్న ప్రతి ఒక్కరికి ఆ వనదేవత ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను అని పోస్ట్ చేశారు.

సమ్మక్క సారమ్మల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ దేవతల చల్లని చూపు తమపై ఉండాలని.. ఆసియా లో భక్త జనవాహిని జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారం సమర్పించడం గిరిజనల సాంప్రదాయాలు పూజా విధానాలకు వేదిక ఈ జాతర అని పోస్ట్ చేశారు. స్త్రీమూర్తులు శక్తి స్వరూపిణలు అని చాటి చెప్తుంది ఇది అని కూడా పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news