టీడీపీతో నేను పొత్తుకు అందుకే వెళ్లాను: పవన్ కళ్యాణ్

-

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లాలో నాలుగవ విడుత వారాహి యాత్రలో భాగంగా ప్రజలతో చాలా బిజీ గా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… పొత్తుల గురించి ఇప్పటికే చాలా సార్లు స్పందించిన మరోసారి అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను టీడీపీ తో పొత్తులను పెట్టుకుంది నా స్వార్ధం కోసం కాదు.. రాష్ట్రంలో మితిమీరిపోతున్న వైసీపీని గద్దె దించడానికి అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉపాధి హామీ కూలీలా పొట్ట కొట్టాడు, ఇందులో భాగంగా 336 కోట్ల రూపాయలు దోచుకున్నారు అంటూ పవన్ ఆరోపించారు. ఇసుక మాఫియా వలన ఎందరో భవన నిర్మాణ కార్మికులు అగచాట్లు పడ్డారు.. ఇలాంటి ఎన్నో అన్యాయమైన పనుల వలన ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలపై అక్రమంగా కేసులను బనాయిస్తూ కసి తీర్చుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మాట్లాడారు. వీరి పొగరు అణచడానికి రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని పారద్రోలడానికి నేను చంద్రబాబు తో కలిసి పోటీ చేయడానికి సన్నద్దమయ్యాను అంటూ పవన్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version