‘విప్లవ కారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో జగన్‌కు రోజూ చూపిస్తా’

-

విప్లవ కారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో జగన్‌కు రోజూ చూపిస్తానన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్. ఇవాళ విశాఖలోని గాజువాకలో నిర్వహించిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో మాట్లాడుతూ… జగన్ ఎన్ని వేషాలు వేసినా మీరు భరించాల్సింది ఆరు నెలలు మాత్రమేనని, ఏమన్నా అంటే వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారన్నారు. నా వ్యక్తిగత జీవితం, తల్లీ, భార్య, పిల్లలను టార్గెట్ చేసినా నేను ఖాతరు చేయను అని పవన్‌ వ్యాఖ్యానించారు. లక్ష కోట్లు విలువున్న ఏపీకి రావాలిసిన ఆస్తులు స్వప్రయోజనాల కోసం తెలంగాణకు వదిలేసిన వ్యక్తి జగన్ అని, అన్నీ అనుకూలిస్తే వైజాగ్ ను రెండో ఇల్లు కట్టుకుంటాను…..పవన్ కళ్యాణ్ మీతో ఉంటే ఆ ధైర్యం వేరు అన్నారు.

అంతేకాకుండా.. ‘పేద జలరిపేట దగ్గర చేసిన ఎంపీ నిర్మాణాల విషయంలో టీడీఆర్ స్కామ్ జరిగింది…వాలంటీర్లుకు యజమాని ఎవరు…? డేటా ఎక్కడికి పోతోంది….. జీత భత్యాలు ఎక్కడ నుంచి ఇస్తున్నారంటే కిక్కురు మనడం లేదు. మూడేళ్ళలో వైజాగ్ ఐటీకి వైభవం తెస్తాం. క్రిమినల్వి కనుకే కేసులు గురించి మాట్లాడుతున్నారు.. ఋషికొండ మీద దేవుడు ఉండటం నాకు ఇష్టం….క్రిమినల్ ఉండటానికి నేను వ్యతిరేకం.. సర్పంచ్ ల పోరాటానికి మద్దతు ఇస్తున్నాం….నేరుగా కేంద్రం నుంచి నిధులు నేరుగా పంచాయితీ లకే వచ్చేలా చేస్తాం.. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ వైసీపీ మద్దతు దారుడు…ఉద్యోగాల భర్తీ, జీతభత్యాలు విషయంలో దారుణగా వ్యవహరిస్తున్నారు. ఋషికొండలో వాల్టా యాక్ట్ ఉల్లంఘన యథేచ్ఛగా జరిగింది. చట్టాలను ఉల్లంఘన నకు పాల్పడే ముఖ్యమంత్రి దిగిపోవాలి. వైజాగ్ ఎంపీ సిరిపురం జంక్షన్లో అనుమతి లేకుండా కడుతున్న నిర్మాణాలను కూల్చి వేస్తాం.’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version