నాపై కోపాన్ని సినిమా ఇండస్ట్రీ మీద చూపొద్దు.. వైసీపీపై పవన్ ఫైర్

-

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్, ఆస్పత్రి బెడ్ పై ఉండగా, రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు పరిశ్రమకు చెందిన పెద్దలు హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వైసీపై ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మడం గురించి మొదలు, సినిమా టికెట్ల రేట్లను పెంచడం వరకు వైసీపీపై విరుచుకు పడ్డారు.

నామీద కోపం ఉంటే నా సినిమాలను ఆపేయ్యండని, అంతేకానీ సినిమా మీద చూపించవద్దని, సినిమాలు మేం తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా అంటూ అన్నారు. ఇంకా అక్రమార్జన చేస్తూ కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకుల గురించి మాట్లాడండని, అంతేకానీ పన్నులు కడుతూ సినిమాలు చేస్తున్న ఇండస్ట్రీ మీద ప్రతాపం చూపించవద్దని మాట్లాడారు. సినిమా రంగం చాలా సున్నితమైనదని, ఇక్కడ పనిచేస్తేనే డబ్బులు వస్తాయని, అడ్డగోలుగా సంపాదించట్లేదని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version