పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో వెళుతున్నారు – లక్ష్మీపార్వతి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో వెళుతున్నారని అన్నారు వైసిపి నేత, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబుతో కలిసి వెళితే ఆయనకు చివరికి మిగిలేది నష్టమేనని వ్యాఖ్యానించారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ చంద్రబాబులో ఎటువంటి పశ్చాత్తాపం లేదని దుయ్యబట్టారు. కమ్యూనిస్టు నేతలు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు లక్ష్మీపార్వతి.

రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలు చేశాడని మండిపడ్డారు. “పవన్ కళ్యాణ్ కి కూడా నేను ఒకటే చెబుతున్నాను. మంచి కుటుంబంలో పుట్టావు బాబు. మంచి అన్నదమ్ములు ఉన్నారు. ఆ పాపాత్ముడు 11 మందిని చంపితే నువ్వు ఒక్కసారైనా ఖండించావా. నీ హితవు కోరే నేను చెబుతున్నాను. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు సంపాదించుకో” అన్నారు లక్ష్మీపార్వతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version