కేంద్రం నిర్ణయం సామాన్యుడికి ఎంతో ఊరట : పవన్‌

-

రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ.. ఇంధన ధరలపై సెంట్రల్‌ ఎక్సైజ్ టాక్స్‌ను తగ్గించింది. అయితే.. పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడికి ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.

ఇంతటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు పవన్‌. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, వర్షాకాలం రాకముందే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు జనసేనాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version