ఏపీలో కీలక పాత్ర పోషిస్తాం…

-


ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించనుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా… 2019లో జరిగే ఎన్నికల ప్రచారానికి నేటి నుంచే శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి తన ఎన్నికల క్యాంపెయిన్ మొదలు పెడుతున్నట్లు ప్రకటించి దూకుడు పెంచారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పవన్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు బంగారు భవిష్యత్తు ఉండాలని పవన్ పేర్కొన్నారు. ఏపీ పునర్నిర్మాణంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాలి. మనమందరం కష్టపడి పనిచేద్దాం.. జనసేనను గెలిపించుకుందాం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పవన్‌ చెప్పారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, అభిమానులు పోటీపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఏపీ లో రాజకీయం రసవత్తరంగా మారనుంది. పంచాయతీల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఏపీలో ఇక సందడే సందడి.

Read more RELATED
Recommended to you

Latest news