పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారు

-

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తుండడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణ సిద్ధం చేశారు.పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలు పార్టీ నేతలు వెల్లడించారు.ముందుగా బీమవరం నియోజకవర్గంలో తొలి సభ నిర్వహించనున్నారు.

అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు.మరోవైపు టీడీపీ ,జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది .ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించనున్నారు. కాగా ఆయన ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పవన్ వారాహి విజయయాత్ర తొలి విడత, రెండో విడత పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news