వ్యాపారుల కోసం పేటీఎం స‌రికొత్త పీవోఎస్ డివైస్‌..!

-

డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ పేటీఎం దేశంలోని వ్యాపారుల కోసం కొత్త‌గా ఆండ్రాయిడ్ ఆధారిత పీవోఎస్ డివైస్‌ను లాంచ్ చేసింది. ఇది చూసేందుకు అచ్చం ఫోన్‌లాగే ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని వ్యాపారులు సుల‌భంగా వాడ‌వ‌చ్చు. వినియోగ‌దారుల నుంచి సుల‌భంగా, వేగంగా పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ప‌ద్ధ‌తిలో పేమెంట్ల‌ను స్వీక‌రించ‌వ‌చ్చు. ఇందులో ట‌చ్ స్క్రీన్ ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేసే వీలు కల్పించారు. 4జీ స‌దుపాయం ఉంది. దీన్ని పేటీఎంకు చెందిన స్కాన్ టు ఆర్డ‌ర్‌, పేటీఎం ఫ‌ర్ బిజినెస్‌తో అనుసంధానించ‌వ‌చ్చు.

paytm launched all in one android based smart pos device

పేటీఎం కొత్త పీవోఎస్ డివైస్‌లో 4.5 ఇంచుల ట‌చ్ స్క్రీన్ ఉంటుంది. ఒక్క‌సారి ఫుల్ చార్జింగ్ చేస్తే దీన్ని రోజంతా పేమెంట్ల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేసేందుకు కెమెరా స‌దుపాయం ఇచ్చారు. 4జి సిమ్ కార్డును వేసుకోవ‌చ్చు. వైఫైకి క‌నెక్ట్ అవొచ్చు. బ్లూటూత్ స‌దుపాయం ఉంది. ఇది కేవ‌లం 163 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది. ఇందులో పేటీఎంకు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు. దాని స‌హాయంతో బిల్లింగ్‌, పేమెంట్స్‌, క‌స్ట‌మ‌ర్ మేనేజ్‌మెంట్ వంటి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ డివైస్‌ను పేటీఎం ఫ‌ర్ బిజినెస్‌కు అనుసంధానించి వాడ‌వ‌చ్చు. జీఎస్‌టీ కంప్లెయింట్ బిల్స్‌ను జ‌న‌రేట్ చేయ‌వ‌చ్చు. లావాదేవీలు, సెటిల్‌మెంట్ల‌ను మేనేజ్ చేయ‌వ‌చ్చు. లోన్లు, ఇన్సూరెన్స్‌, డిజిట‌ల్ లెడ్జ‌ర్ స‌దుపాయాల‌ను పొంద‌వ‌చ్చు. పేటీఎం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఆలిన్ వ‌న్ పోర్ట‌బుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పీవోఎస్ డివైస్‌ను ప్ర‌స్తుతం రెంట‌ల్ ప‌ద్ధ‌తిలో ఇస్తున్నారు. దీనికి గాను వ్యాపారులు నెల‌కు రూ.499 రుసుం చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news