ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్లుండి సెలవు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీలలో విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాలనుకునే అన్ని జిల్లాల ఉద్యోగులకు ఎల్లుండి ప్రత్యేకమైన సెలవును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమావేశాలకు రెండు రోజులు సెలవు ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ కోరినప్పటికీ కేవలం ఒక రోజుకు మాత్రమే సెలవును మంజూరు చేశారు.

ఈ సెలవు పొందాలని అనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచనలు చేశారు. దరఖాస్తు చేసుకుంటేనే ఉద్యోగులకు సెలవు మంజూరు అవుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా…. ఏపీ ప్రభుత్వం అనేక రకాల కొత్త పథకాలను అమలులోకి తీసుకువస్తోంది. ఏపీలో ఆర్టీసీ బస్టాండ్ లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి శ్రీకారం చూడుతోంది ఏపీ ప్రభుత్వం. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.