సైకో కిల్లర్‌ రాములు ఖైదీలకు నేరపాఠాలు..!

-

ఇటీవల మహిళలను అతికిరాతంగా హత్య చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సైకో కిల్లర్‌ రాములు ఇప్పుడు జైల్లో ఉండి తోటి ఖైదీలకు నేర పాఠాలు చెబుతున్నాడు. 18 ఏళ్లకే 18 మంది మహిళలను పొట్టనబెట్టుకున్న సైకో కిల్లర్‌ గురించి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం 45 ఏళ్ల ఉన్న రాములుకి 21 ఏళ్లలో పెళ్లి చేశారు. రంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు భార్య ఓ వ్యక్తితో వెళ్లిపోవడంతో అప్పటి నుంచి మహిళలపై కోపం పెంచుకున్నాడు. 2003 నుంచి వివిధ కమిషనర్‌ రేట్ల పరిధిలో 18 మంది మహిళలను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇటీవల ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ మహిళ హత్యను విచారిస్తుండగా రాములు చేసిన హత్యలు బయటకు రావడంతో గత నెల 26 రిమాండ్‌కు తరలించారు.

ఏ జైలు కెళ్లినా అదే తీరు..

అతగాడు చేసిన హత్యలో నలుగురి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు. ఆ వివరాల కోసం కోర్టు అనుమతితో మూడ్రోజుల క్రితం నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చేశాయి.గతంలోనే రాములు పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలుకి వెళ్లిన ప్రతిసారీ అక్కడున్న తోటి ఖైదీలను స్నేహితులుగా మార్చుకొని హత్యలు ఎలా చేయాలి..? పోలీసులు విచారణలో ఎలా సమాధానాలు చెప్పాలి..? హత్య చేసిన తర్వాత ఏం చేస్తే పోలీసులకు దొరకం..? అనే విషయాలౖపై వారికి నేర పాఠాలు చెబుతున్నట్లు సమాచారం.

డార్క్‌రూంలో బంధించినా ..

డార్క్‌రూంలో బంధించినా అతగాడిలో మార్పు రాకపోవడంతో 2015లో వరంగల్‌ జైలుకు తరలించారు. అక్కడ కూడా ఓ నిందితుడికి జైలు నుంచి తప్పించుకునే ఉపాయం చెప్పి ఓ హత్యకు ప్లాన్‌ కూడా గీసి ఇవ్వడంతో దాన్ని అమలు చేసిన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. బయటకు వెళ్లిన నిందితుడు హత్యకు సంబంధించిన ఆయుధాలు కొనుగోలు చేసే క్రమంలో కరీంనగర్‌ పోలీసులకు దొరకడంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

Read more RELATED
Recommended to you

Latest news