ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్త మర్డర్‌కు ప్లాన్.. మిస్టరీ వీడిన వరంగల్ హత్యాయత్నం కేసు

-

వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.ప్రియుడికి సుపారీ ఇచ్చి భర్తను హత్యచేయించాలని భార్య చూసినట్లు విచారణలో తేలింది.సంగారెడ్డిలో ప్లాన్ చేసి మరీ వరంగల్లో అటాక్ చేయించింది. పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరాకి కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. సంగారెడ్డిలో కొన్ని రోజుల పాటు సుమంత్ రెడ్డి డాక్టర్‌గా పనిచేశారు.

భార్య ఫ్లోరా సంగారెడ్డిలో జిమ్‌కి వెళ్తున్న టైంలో సామెల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసి భార్య ఫ్లోరాని భర్త మందలించాడు.తర్వాత కొన్ని రోజులకు వరంగల్‌కు షిఫ్ట్ అయ్యారు.కాజీపేటలో క్లినిక్ పెట్టుకున్న సుమంత్, రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా ఫ్లోరా పనిచేస్తున్నది. ఈ క్రమంలోనే సుమంత్‌ని చంపేస్తే ఇద్దరు కలిసి ఉండవచ్చని ప్లాన్ చేసింది భార్య. మర్డర్ ప్లాన్‌కి గచ్చిబౌలిలో పనిచేస్తున్న ఓ AR కానిస్టేబుల్ సాయం తీసుకున్నాడు ప్రియుడు సామెల్.దీంతో వరంగల్లో కారుని అడ్డగించి నడి రోడ్డుపై సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. ప్రస్తుతం డాక్టర్ సుమంత్ చావుబతుకుల్లో ఉన్నారు.అయితే, నిందితులను మహారాష్ట్రలో పట్టుకుని వరంగల్‌కి తీసుకెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version