రైతులకు శుభవార్త..పీఎం కిసాన్‌ 13వ విడత నిధులు విడుదల

-

దేశంలోని రైతులందరికీ మోడీ సర్కార్‌ అదిరిపోయే తీపి కబురు చెప్పింది. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. అయితే, రైతుల ఖాతాల్లోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది.

పీఎం కిసాన్ పథకం కింద 13వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఢిల్లీ వేదికగా ఓ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 13వ విడత కిసాన్ సమ్మన్ స్కీము నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. అయితే ఈ కార్యక్రమం ఈ నెల చివరల్లో జరుగనుంది. ఆ వెంటనే ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులందరికీ ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది. ఈ లెక్కన ఈ నెల చివరలో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో పడనున్నాయన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news