రైతులకు శుభవార్త అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లుగా కేంద్రం ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. కిసాన్ సన్మాన్ నిధి డబ్బులను ఈ నెల 3 వ వారంలోనే రైతుల అకౌంట్లోకి వేయనున్నట్లుగా స్పష్టం చేశారు. అన్నదాతలకు కేంద్రం మూడు విడతల్లో రూ. 6000 సాయం అందిస్తోంది.

ఇది వరకే ఈ సంవత్సరం తొలివిడత రూ. 2000 ఫిబ్రవరి 19వ తేదీన పూర్తి అయ్యా యి. రెండవ విడత మొత్తం 20వ తేదీన ఈనెల మూడవ వారంలో రైతుల అకౌంట్లోకి జమ చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. కిసాన్ నిధి డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నట్లయితేనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రైతులు అలర్ట్ అవుతున్నారు.