Pm Modi : కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ పూజలు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇవాళ ఉదయం కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించారు. బాబా కేదార్‌కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్‌నాథ్‌ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక వస్త్రధారణలో మోదీ  ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

 

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ దుస్తులు చోలా దొరను ధరించిన ప్రధాని మోదీ కేదార్ నాథ్ ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు. గౌరికుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు రోప్‌వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కేదార్ నాథ్ పర్యటన అనంతరం ఇవాళ సాయంత్రం బ్రదీనాథ్‌ కూడా మోదీ వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version