BIG BREAKING : విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

-

నేడు, రేపు విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌లు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి ఈస్ట్రన్ నావల్ కమాండ్‌లోని ఐఎన్‌ఎస్ చోళాలో బస చేయనున్నారు మోడీ. ఐఎన్‌ఎస్ చోళకు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ.. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో విడివిడిగా సమావేశం కానున్నారు మోడీ. రేపు ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ఇక్కడి నుంచే ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ప్రధాని పాల్గొనే ఈ సభ వేదిక మీద ఉండేందుకు అధికారులు 8 మందికే అవకాశం కల్పించారు. సభా వేదికపైకి ప్రధాని మోదీతో పాటు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డిలు ఉండనున్నారు. ప్రధాని మోదీ 10.15 నుంచి 11.30 గంటలకు ఇక్కడ ఉండనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సభకు స్వాగతం పలకనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version