ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ అత్య‌వ‌స‌ర‌ భేటీ

-

ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ అత్య‌వ‌స‌ర‌ భేటీ కానున్నారు. ఉప రాష్ట్రప‌తి ఎన్నిక ఉన్న త‌రుణంలోనే.. ఎన్డీఏ కూట‌మి ఎంపీలతో ప్రధాని మోదీ అత్య‌వ‌స‌ర‌ భేటీ కానున్నారు. ఇక అటు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌లో మాక్ ఓటింగ్ ఉండ‌నుంది. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు కూడా పాల్గొననున్నారు.

Independence Day 2025 PM Modi Makes BIG Announcement on GST Reforms
Prime Minister Modi 

ఇవాళ సాయంత్రం ఎన్డీయే కూటమి పక్షాల ఎంపీల మాక్ ఓటింగ్ ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లు ఉంటారు. మొత్తం సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే.. 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు ఖాయం.

ఉపరాష్ట్రపతి ఎన్నిక నేప‌థ్యంలో… బీఆర్ ఎస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి (BRS) పార్టీ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news