జూలై 3న తెలంగాణకు ప్రధాని మోడీ.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

-

జూలై 3న తెలంగాణకు ప్రధాని మోడీ.. రానున్నట్లు పేర్కొన్నారు బిజెపి ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. ఇవాళ బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంతో లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జూలై 2,3,4 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 3 వ తేదీ భారీ బహిరంగ నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు బీజేపీ లక్ష్మణ్. మోడీ తో పాటు కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల సీఎం లు ,డిప్యూటీ సీఎం లు హాజరు అవుతారన్నారు.

తెలంగాణ  సంస్కృతి సంప్రదా యాల ఉట్టి పడే విధంగా సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. జాతీయ సమావేశాలకు వచ్చిన నేతలతో ఇక్కడ నివాసం ఉంటున్న ఆయా రాష్ట్రాల ప్రజలతో సమావేశాలు.. జరుగుతాయని స్పష్టం చేశారు లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version