రేపు మోడీ పరీక్ష పే చర్చ.. విద్యార్థులతో వర్చువల్ గా మాట్లాడనున్న ప్రధాని

-

పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈనెల 27న (రేపు) పరీక్ష పే చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేపు ఉదయం విద్యార్థులతో వర్చువల్ గా మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో వీక్షించేలా బిజెపి ఏర్పాట్లు చేస్తోంది. స్కూళ్లలో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాట్లు చేస్తోంది.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కనీసం 5 పాఠశాలల్లో పరీక్ష పే చర్చ జరిపేలా సన్నాహాలు చేస్తుంది. అందులో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది బీజేపీ. ఇప్పటికే పరీక్ష పే చర్చ విస్తృత ప్రచారం కోసం స్కూళ్లలో చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీల ఏర్పాటు చేసింది. మొదటిసారి ఈ కార్యక్రమం పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version