మ‌రి కొద్ది సేప‌ట్లో జాతి ని ఉద్ధేశించి పీఎం మోడీ ప్ర‌సంగం

-

ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు జాతీని ఉద్ధేశించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌సంగించ నున్నారు. ఈ విష‌యాన్ని కాసేపటి క్రితం ఢిల్లీ లో ఉన్న పీఎం వో అధికారులు ట్విట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌సంగం లో ప్ర‌ధాన మంత్రి మోడీ ఎం మాట్లాడుతారో .. అని చాలా మంది ఎదురు చుప‌స్తున్నారు. కాగ ఈ రోజు సిక్కుల మొద‌టి గురువు గురు నాన‌క్ జ‌యంతి. సిక్కు మ‌తంలో చాలా ప‌విత్ర‌మైన పండుగ‌ల‌లో గురు నానక్ జయంతి ఒక‌టి . దీంతో గురు నానక్ జ‌యంతి గురించి.. సిక్కుల గురించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడే అవ‌కాశం ఉంది.

అలాగే ఈ రోజు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ని మ‌హోబా లో నీటి పారుద‌ల‌కు సంబంధించిన ప‌లు కీల‌క ప‌థ‌కాల‌ను ప్రారంభించ నున్నాడ‌ని పీఎంవో ట్విట్ట‌ర్ వేదిక గా తెలిపింది. అలాగే ఈ కార్యక్ర‌మం తర్వాత రాష్ట్ర ర‌క్ష సంప‌ర్ప‌ణ ప‌ర్వ్ కోసం ప్ర‌ధాని మోడీ ఝాన్సి కి వెళ్తాడ‌ని పీఎంవో ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. అయితే ఈ రెండు కార్య క్ర‌మాల‌కు ముందు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ జాతీని ఉద్దేశించి ప్ర‌సంగం చేయ‌నున్నాడ‌ని పీఎంవో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news