కోరుట్లలో ఏటీఎం చోరీ.. ఛేజ్ చేసి దొంగల్ని పట్టుకున్న పోలీసులు

-

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఏటీఎం చోరీకి కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం నుంచి నగదు చోరీ కారులో వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని వెంబడించారు.

నగదుతో కారులో ఉడాయిస్తున్న దొంగలను సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. వారి కారును ఢీకొట్టి మరీ దుండగులను పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకునేటప్పుడు దుండగులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఏటీఎంలో చొరబడటం.. నగదు చోరీ చేయడం.. ఆ తర్వాత కారులో వెళ్లడం.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version