హైపర్ ఆది పై షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!

-

జబర్దస్త్ కమెడియన్గా ఒక వెలుగు వెలుగుతున్న హైపర్ ఆది.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ముఖ్యంగా పలు సినిమాలలో కూడా విభిన్నమైన పాత్రలలో కమెడియన్ గా నటిస్తున్నారు. రాజకీయాలలో చురుకుగా ఉండాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున పలు విషయాలలో పాల్గొంటూ ఉంటారు హైపర్ ఆది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సమయంలో పవన్ తో బాగా చనువు ఏర్పడడంతో రెండు రోజుల క్రితం నిర్వహించిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది కనిపించారు.ఈ సభలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

ఈ వేదికపై హైపర్ ఆది మాట్లాడుతూ 150 మంది ఎమ్మెల్యేలు ఒకరికి భయపడుతున్నారు అంటే తన పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు. ఇక్కడికి వచ్చినవారు అందరూ కూడా మందుకో, బిర్యానీకో రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చారని తెలిపారు. కౌలు రైతుల కష్టాల కోసం సినిమాలను ఒప్పుకుంటే తప్పు మీరేమో వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు చేయవచ్చా అంటు ఆంధ్రప్రదేశ్ మంత్రుల పైన విరుచుకుపడ్డారు హైపర్ ఆది.

దీంతో ఒక్కసారిగా హైపర్ ఆది మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ మాటలపై నటి శ్రీరెడ్డి దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. శ్రీ రెడ్డి మాట్లాడుతూ..హైపర్ ఆది, రాంప్రసాద్ ని ఎందుకు జగన్ బర్త్ డే కి పిలిచారు వాళ్ళు రాకపోతే బర్తడే ఏమైనా ఆగిపోతుందా.. వాళ్ల కుక్క బుద్ధి మరొకసారి చూపించారు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఎలాంటివైనా తింటారు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ఆర్టిస్టు కానటువంటి ఒక వెధవని తీసుకువచ్చి పబ్లిక్ సిటీ కోసం పవన్ కళ్యాణ్ ఇంతలా దిగజారిపోయారంటే ఇక తన పరిస్థితి ఎలా ఉందో అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version