ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..ఈ రూల్స్ పాటించాల్సిందే

-

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై , కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు కొనసాగుతున్నాయి సంగతి అందరికి తెలుసు. వాటితోపాటు, పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్ అలాగే అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల అభ్యర్థుల మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 2న నిర్వహించునట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి నీయకమండలి ప్రకటించింది. ఈ పరీక్షలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 2వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలంగాణ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. పరీక్షకు సంబందించిన హల్ టిక్కెట్లు వెబ్ సైట్లో విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ లో ఇబ్బందులుంటే 9393711110, 9391005006 నెంబర్లను సంప్రదించాలని సూసించారు . హాల్ టికెట్ పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news