బ్రేకింగ్ న్యూస్ : తుపాకీతో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య..

-

కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్సై ఈ రోజు తెల్లవారుజామన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అధికారులు మాత్రం తుపాకీ మిస్‌ఫైర్ జరగడం వల్లే ఆయన మృతి చెందినట్టు చెబుతున్నారు. నిన్న సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన ఎస్సై.. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువుకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో పనిచేశారు గోపాలకృష్ణ. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే జీజీహెచ్‌ను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version