రేప్ బాధితురాలికి పోలీసుల కర్మకాండలు..!

-

దేశంలో అత్యాచార ఘటనలు రోజుకి రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఎన్ని చట్టాలు, చేసినా కాల్చి చంపినా సరే అత్యాచార బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి మృగం మాదిరి ప్రవర్తిస్తున్నారు కొందరు. జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోరికలను తీర్చుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ వీటికి బలైపోయారు.

దేశం మొత్తం పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి. దీనితో ఆడపిల్ల బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ లో ఒక విషాద ఘటన జరిగింది. ఎవరూ లేని అనాధ ఇటీవల రేప్ కి గురైంది. ఆమెను ఆగ్రాలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స అందించారు. అయితే ఆమె మరణించింది.

దీనితో ఆమెను తీసుకువెళ్ళడానికి ఎవరూ రాలేదు. ఆమెకు హిందు సంప్రాదాయ పద్దతిలో అంత్యక్రియలు జరిపించిన పోలీసులు, మృతదేహానికి అంత్యక్రియలు చేసి అన్నదానం చేశారు.అత్యాచార బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాక అంత్యక్రియలు చేశామని జిల్లా ఎస్పీ రోహాన్ ప్రమోద్ మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version