ఢిల్లీ ఓటర్లకు బంపర్‌ ఆఫర్‌.. బైక్ నుంచి ఫ్లైట్ వరకూ ఫ్రీ…ఫ్రీ…ఫ్రీ..!!

-

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్లు వచ్చాయి. అది కూడా ఇవాళ ఒక్కరోజు మాత్రమే. ఇవాళ జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషన్ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రైవేట్ వాహన రంగ సంస్థలు కూడా నడుంబిగించాయి. పోలింగ్‌ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం ఆఫర్‌ చేయడం విశేషం. ఇందులో ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ కూడా ఉచిత సర్వీస్‌ అందిస్తానంది.

బైక్-టాక్సీ బుకింగ్ యాప్ ‘రాపిడో’ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఉచిత బస్సు సేవలకు ముందుకు వచ్చింది. ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్‌ జెట్‌ ఈరోజు ఢిల్లీ వచ్చేవారు, తిరిగి ఇదే రోజు వెళ్లిపోతే రానుపోను టిక్కెట్లపై బేస్ చార్జీని వాపసు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news