ధోనీకి అరుదైన గౌరవం…డిఫెన్స్ మినిస్టరీ కమిటీలో చోటు

-

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అయితే అది క్రికెట్ కు సంబంధించినది కాదు. మహేంద్ర సింగ్ ధోనీకి భారత మిలిటరీ లోని గౌరవ లెఫ్ట్నెంట్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన మహేంద్రసింగ్ ధోని… పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కి మరో అరుదైన గౌరవం ఇచ్చింది మిలటరీ. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎన్ సి సి) రివ్యూ చేసే 15మంది డిఫెన్స్ మినిస్టర్ ఈ కమిటీలో మహేంద్ర సింగ్ ధోనీ కి చోటు దక్కింది. ఎన్సిసి పై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు, జాతీయ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది మిలటరీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ తో పాటు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరియు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు. ఎన్ సి సి లోని మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news