ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలి : హైపర్‌ ఆది

-

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది కూడా హాజరయ్యారు. తనదైనశైలిలో పంచ్ లు వేస్తూ వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ ను కూడా నవ్వించారు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఆ శాఖ పెట్టుకుని అదే పనిగా తిట్టుకోండి… శాఖల పరువు తీస్తున్నారు… మీ శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే మీరు పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ విమర్శించారు హైపర్ ఆది. “వారాహి బండిని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు… అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందే. పవన్ కల్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడు. ఈ మధ్య ప్యాకేజీ అంటున్నారు… పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడే తప్ప…. ప్యాకేజీకి కాదురా….! ఇంకా, దత్తపుత్రుడు అంటున్నారు… మీరు ఏ నోటితో అయితే దత్తపుత్రుడు అన్నారో అదే నోటితో అంజనీపుత్రుడు అనిపించుకుంటారు.

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్ ను ఏదో ఒక మాట అనేసి పాప్యులర్ అయిపోవాలనుకునేవాడే! మీ పాప్యులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు! నిలకడలేని రాజకీయం అంటున్నారు… మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా? వ్యాపారాలు ఏమీ లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? టేబుల్ పై భారతదేశం బొమ్మ పెట్టుకుని, టేబుల్ కింద చేయిచాచే మీది నిలకడలేని రాజకీయం… అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అమ్మనాబూతులు తిట్టే మీది నిలకడలేని రాజకీయం.’ అని హైపర్ ఆది వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version