జ‌గ‌న్ స‌ర్కార్ విధానాల వల్లే.. ప్ర‌జ‌లు రోడ్డెక్కుతున్నారు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు రోడ్డెక్క‌డానికి, రైతులు ఆత్మ‌హత్య‌లు చేసుకోవ‌డానికి కార‌ణం.. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాలే అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను తాను వ్య‌తిరేకిస్తే.. రాక్షసుడు, దుర్మార్గుడు అంటూ త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కులు త‌న‌పై నోటికి వ‌చ్చినట్టు విమ‌ర్శ‌లు చేస్తే.. చూస్తు ఉరుకోన‌ని హెచ్చ‌రించారు.

pawan-kalyan

తాను జన‌సేన పార్టీని వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం పెట్ట‌లేద‌ని అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం తాను పార్టీని స్థాపించాన‌ని వెల్ల‌డించారు. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న‌ అనాధికార క‌రెంటు కోత‌ల‌తో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.

ప‌వ‌న్ హాలిడే పేరుతో ప‌రిశ్ర‌మ‌ల‌కు కూడా స‌మ‌స్య‌లు తీసుకువ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌వ‌ర్ హాలిడే ద్వారా రాష్ట్రంలో ఉన్న 36 ల‌క్షల మంది కార్మికులకు ఉపాధి దూరం అవుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news