ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఏ ఒక్క వెధవ మాట్లాడలేదు ఎందుకు…? నాగబాబు ఫైర్

-

నా తమ్ముడు పవన్ ఎవరినైనా తిట్టాడా? మీ జోలికి వచ్చాడా? ఒరేయ్ రాస్కెల్స్ .. తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఏ ఒక్క వెధవ ఎందుకు మాట్లాడలేదు.. అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు..

జనసేన పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేసిన ప్రముఖ సినీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఏ ఒక్క వెధవ ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. వైజాగ్ లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా నాగబాబు రెచ్చిపోయారు.

నా తమ్ముడు పవన్ ఎవరినైనా తిట్టాడా? మీ జోలికి వచ్చాడా? ఒరేయ్ రాస్కెల్స్ .. తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఏ ఒక్క వెధవ ఎందుకు మాట్లాడలేదు. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రభుత్వాన్ని జనసేన ప్రశ్నించింది. అది జనసేన స్పిరిట్.

ప్రజల పక్షాన పోరాడే దమ్ము ఒక్క జనసేనకే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతోనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాన్ని ప్రశ్నించేందుకు షోకాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ నాయకులకు దైర్యం లేదు. కానీ.. పవన్ కల్యాణ్ ను మాత్రం తిడతారు.. అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

జగన్ కు సవాల్ విసిరిన నాగబాబు

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు చనిపోతే వైఎస్ జగన్ కానీ… విజయసాయిరెడ్డి కానీ ఎందుకు స్పందించలేదు. విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడటానికి నోరు రాలేదా? అది పక్క రాష్ట్రం సమస్య.. మనకెందుకులే అని ఊరుకున్నారా? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి జగన్.. గొప్పగా మాట్లాడుతారు కదా. నాకు గానీ.. పవన్ కల్యాణ్ కు గానీ.. కేసీఆర్ అంటే భయం లేదు. ఐ డోంట్ కేర్ కేసీఆర్.. అంటూ నాగబాబు ఆగ్రహించారు. దమ్ముంటే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జగన్ స్పందించాలని.. నాగబాబు సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version