పరిటాలవారింట మొద‌లైన పెళ్లిసంద‌డి.. వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

-

తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సునీత దంప‌తుల‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వీరి రెండో కుమారుడు పరిటాల సిద్ధార్థ వివాహం తేజస్వితో జరగబోతోంది. ఈ సాయంత్రం 6 గంటలకు అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని నసనకోట సమీపంలో ఉన్న తిరుమల దేవర ఆలయంలో వివాహ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత నారా లోకేశ్, సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరుకానున్నారు. రేపు వివాహం జరగనుంది.

ఈ నేపథ్యంలో, సిద్ధార్థను పెళ్లికుమారుడిని చేయడం, పెళ్లిపందిరి వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సిద్ధార్థను ఆయన తల్లి సునీత, అన్న శ్రీరామ్, వదిన జ్ఞాన ఆశీర్వదించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. కాగా, సిద్ధార్థ… తేజస్విని వివాహ నిశ్చితార్థ వేడుక ఇటీవ‌ల హైదరాబాద్ గండిపేట ప్రాంతంలోని రిధిరా రిట్రీట్‌ రిసార్ట్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు నారా చంద్రబాబు ఫ్యామిలీ మ‌రియు ఇత‌ర‌ రాజ‌కీయ నేత‌లు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version