జగన్ కోసం ఎందాకైనా వెళ్తా అంటున్న మాజీ మంత్రి.. సోషల్ మీడియాలో ప్రశంసలు..

-

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీడియాలో మాట్లాడేందుకు నేతలు పోటీపడేవారు.. తమకు అవకాశం రాలేదంటూ నిష్ఠూరం కూడా ఆడేవారు.. అధికారం కోల్పోయిన వెంటనే.. అందరూ కనుమరుగయ్యారు.. పార్టీ వాయిస్ వినిపించేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడంలేదు.. ఇలాంటి సమయంలో.. నేనున్నానంటూ ముందుకొచ్చారు మాజీ మంత్రి పేర్నినాని.. కార్యకర్తలకు అండగా ఉండటంతో పాటు.. ప్రత్యర్దులపై నిప్పులు చెరుగుతున్నారు..

మంత్రిగా ఉన్నా.. మాజీగా ఉన్నా.. పేర్ని నాని మాత్రం నిత్యం మీడియాలోనే కనిపించేవారు.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఇలా ఎవరినీ వదలిపెట్టకుండా విమర్శించేవారు. పేర్ని నాని సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకుని మరీ నిఖార్సయిన జవాబిచ్చేవారు. తన కుమారుడిని రాజకయాల్లోకి దింపి.. తాను విశ్రాంతి తీసుకుంటానని గతంలో ఆయన ప్రకటించారు.. అయితే పేర్ని కిట్టు గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత.. నాని మళ్లీ యాక్టివ్ అయ్యారు..

రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానన్న పేర్ని నాని ఎన్నికలలో ఓటమి తర్వాత మాత్రం ఆ ఆలోచనను విరమించుకున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమే కేంద్రంగా ఆయనప్రతి రోజూ అధికార పక్షానికి కౌంటర్ ఇస్తున్నారు.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తుంది.. దీంతో ప్రభుత్వం మీద మాట్లాడేందుకు ఎవ్వరూ ముందుకు రాని సమయంలో నాని మాత్రం.. ఘాటైన విమర్శలు చేస్తూ.. వారికి యముడుగా మారారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. వైసీపీ క్యాడర్ కూడా పేర్ని నానిని సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతుంది. ఇలాంటి నాయకులు మరింత మంది మీడియా ముందుకు వచ్చివాయిస్ వినిపించాలని కోరుకుంటోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version