హమ్మ‌య్య‌.. న‌గ‌రిలో రోజా గెలిచారు..!

-

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌దుందుభి మోగిస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను వైకాపా 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, ఇప్ప‌టికే ఆ పార్టీ 36 స్థానాల్లో గెలుపొందింది. ఇక న‌గ‌రి వైకాపా అభ్య‌ర్థి ఆర్‌కే రోజా ఈసారి కూడా విజ‌యం సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి గాలి భాను ప్ర‌కాష్ (టీడీపీ)పై రోజా 2681 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

2014 ఎన్నిక‌ల్లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రఫున గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పోటీ చేయ‌గా అప్ప‌ట్లో రోజా ఆయ‌న‌పై 858 ఓట్ల తేడాతో గెలిచారు. కానీ ఇప్పుడు మెజారిటీ అప్ప‌టిక‌న్నా స్వ‌ల్పంగా పెరిగింది. ఇక గ‌తంలో గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అనారోగ్యంతో క‌న్నుమూయ‌గా ఈసారి ఆయ‌న కుమారుడు గాలి భాను ప్ర‌కాష్ టీడీపీ త‌ర‌ఫున న‌గ‌రి బ‌రిలో నిలిచి రోజా చేతిలో ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version