క్షమాపణలు చెబుతూ దిగజారుతున్న నేతలు.. రాహుల్ గాంధీ కూడా తెగింపు !

-

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోకలే… ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. మాజీ దౌత్య వేత్త లక్ష్మి మురుడేశ్వర్ పూరీకి బేషరతుగా క్షమాపణలు చెప్పారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోకలే. చాలా సంవత్సరాలుగా నడుస్తున్న పరువు నష్టం కేసు.. ఈ ఒక్క క్షమాపణలతో.. ముగిసిపోయింది. 2021 నుంచి ఇప్పటివరకు ఈ పరువు నష్టం కేసు కొనసాగిన సంగతి తెలిసిందే.

Trinamool Congress MP Saket Gokhale rahul gandhi
Trinamool Congress MP Saket Gokhale rahul gandhi

అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ క్షమాపణలు చెప్పడంతో కేసు ముగిసినట్లయింది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో పూరి ఆస్తిని కొనుగోలు చేయడాన్ని ప్రశ్నిస్తూ 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు సాకేత్ పోస్ట్ పెట్టారు. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. వివాదం రాజుకుంది. అయితే ఎంపీ సాకేత్ ను చట్టపర చర్యలు ఎదుర్కొనేలా చేయడం జరిగింది. క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు 50 లక్షల నష్టపరిహారం, ఇకపై ఎలాంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయకుండా కోర్టు అప్పుడే నిషేధ ఆజ్ఞలు విధించింది.

తృణముల్ కాంగ్రెస్ ఒకటే కాదు కాంగ్రెస్ నేతలు కూడా ఇలా పరువు నష్టం కలిగేలా చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. ఈ విషయంలో తక్కువ ఏమి తినలేదు. 2016లో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కూన్ కి దళాలి అంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే సర్జికల్ స్ట్రైక్ కూడా రాజకీయాల కోసం చేయిస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఇలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు చాలామంది తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పరువు నష్టం దావా వేయడంతో దిగివచ్చారు. బిజెపి అలాగే బిజెపికి అనుబంధంగా పనిచేసే సంస్థలపై కూడా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news