జనసేనలోకి టిడిపి మాజీ చైర్మన్

-

  • దసరా రోజు పార్టీలో చేరేందుకు ముహూర్తం
  • చంద్రబాబు అవమానించారంటూ అలక


అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ను గురువారం చదలవాడ వ్యక్తిగతంగా కలిశారు. అక్టోబర్లో విజయదశమి రోజున అధికారికంగా జనసేనలో చేరనున్నట్లు చదలవాడ అనుచరులు చెబుతున్నారు. ఇటీవల టిటిడి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు సరైన గౌరవం ఇవ్వనందునే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యానని, కనీసం తనతో మాట్లాడలేదని చదలవాడ తన సన్నిహితుల వద్ద వాపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version