మీకే టైం ఇస్తారా?పేదల సంగతేంటి..హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ ట్వీట్ వైరల్

-

హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘అనుముల తిరుపతి రెడ్డి గారు.. LKG చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల కిందట కొనుగోలు చేసిన ఇల్లు నేల మట్టమైంది.

వారం క్రితం గృహప్రవేశం చేసిన ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా..పేక మేడలా కూల్చివేయబడింది.క్షణం కూడా టైం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా..తిరుపతి రెడ్డి ఇంటి విషయంలో మాత్రం నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా..ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది.కోర్టులో స్టే తెచ్చుకున్నారు.ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!.. మీ సోదరుడి బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి’ అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version