వర్ల రామయ్య కి అద్భుతంగా చెక్ పెట్టబోతున్న వై ఎస్  జగన్ – ఇక నోట మాట కూడా రాకుండా!

-

తెలుగుదేశం పార్టీ తరపున మీడియా ముందు మాట్లాడే ప్రముఖులలో ఒకరు వర్ల రామయ్య. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్టీసీ తరపున ప్రభుత్వ పదవిలో వర్ల రామయ్య పని చేయడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ప్రస్తుతం టీడీపీ స్పోక్స్ పర్సన్ గా అధికార పార్టీ వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో టిడిపి తరపున కౌంటర్లు వేస్తున్నారు. చాలా సందర్భాలలో వైయస్ జగన్ ని ఉద్దేశించి వర్ల రామయ్య దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అయితే ప్రస్తుతం ఇదేవిధంగా ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ నీ సెర్బియా పోలీసులు ఏడు నెలల క్రితం అరెస్టు చేసిన సందర్భంలో ఆ కేసును ఉద్దేశించి జగన్ పైన దారుణమైన విమర్శలు చేశారు వర్ల రామయ్య. అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కంపెనీలో తాను పెట్టుబడులు పెట్టినట్లు అక్కడ అధికారులకు వెల్లడించారని ఆరోపించారు.

 

ఈ నేపథ్యంలో ఈ కేసును ఉద్దేశించి ట్విట్టర్లో మరింత దూకుడు పెంచాడు…వర్ల రామయ్య ఏమన్నారంటే ‘రస్‌ అల్‌ ఖైమా దెబ్బకి ముద్దాయి-2 విజయసాయిరెడ్డికి మైన్డ్ చలించింది. నిన్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడితే, ఈ గుడ్డి రెడ్డిగారికి స్పందన కన్పించలేదట? మంచి కంటి డాక్టర్ కు చూపించుకోండి. మీ పార్టీ జాతకం నిమ్మగడ్డ ప్రసాద్ రస్‌ అల్‌ ఖైమాకు మార్చబోతున్నారు సర్దుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఉన్న కొద్దీ వర్ల రామయ్య మాటలు ఎక్కువ అవుతున్న తరుణంలో వైయస్ జగన్ అద్భుతంగా చెక్ పెట్టడానికి వర్ల రామయ్య ఆరోపణలకు నోటి మాట రాకుండా రోజాతో కౌంటర్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version