వైఎస్ జగన్ పై మరోసారి దాడి జరగనుందా? ప్రముఖ జ్యోతిష్యుడు ఏమన్నారంటే?

-

ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వేణు స్వామి… వైఎస్ జగన్ జాతకం గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. వైఎస్ జగన్ ది ఆరుద్ర నక్షత్రం అట. మిథున రాశి అట. ప్రస్తుతం శని హోరులో ఉన్నారట. దీంతో శత్రువులు మరోసారి ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని వేణు స్వామి హెచ్చరించారు.

అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయి… అందరినీ ఆకర్షించారు వైఎస్ జగన్. దేశవ్యాప్తంగా ఇఫ్పుడు జగన్ గురించే చర్చ. అయితే.. ఆయన ముఖ్యమంత్రి అవడం వల్ల ఓర్వలేని కొన్ని శక్తులు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. జగన్.. ఏపీకి ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ… కొన్ని దుష్టశక్తులు ఆ పనులను చేయనిచ్చేలా లేవు అని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి.

అవును.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్రాణ హాని ఉందట. ఇదివరకు ఒకసారి విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే కదా. ఆ ఘటనలో ఆయన భుజానికి గాయం అయినప్పటికీ.. ప్రాణాలతో జగన్ బయటపడ్డారు. దానికి తోడు మరో దాడి జగన్ పై జరగబోతున్నదట. ఈ విషయాన్ని వేణు స్వామి జగన్ కు కూడా చెప్పారట.

ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వేణు స్వామి… వైఎస్ జగన్ జాతకం గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. వైఎస్ జగన్ ది ఆరుద్ర నక్షత్రం అట. మిథున రాశి అట. ప్రస్తుతం శని హోరులో ఉన్నారట. దీంతో శత్రువులు మరోసారి ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని వేణు స్వామి హెచ్చరించారు.

అయితే.. ఈసారి జరిగే దాడి కాస్త పెద్దదిగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఆ దాడి నుంచి జగన్ తప్పించుకోగలిగితే.. జగన్ కు ఇక తిరుగే ఉండదంటున్నారు వేణు స్వామి.

వైఎస్ జగన్ కు 2020 ఏప్రిల్ 24 నుంచి అష్టమి శని ప్రారంభం అవుతుందట. ఆ సమయంలోనే ఆయనకు కష్టకాలం మొదలవుతుందని.. 2020 ఏప్రిల్ 24 తర్వాత జగన్ పై దాడి జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. విమానంలో వెళ్తున్నప్పుడు కానీ… కాన్వాయ్ లో వెళ్తున్నప్పుడు కానీ.. జగన్ కు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version