చెత్తాంధ్ర‌ప్ర‌దేశ్ చేసేస్తున్నారు: సీఎంపై గౌతంరెడ్డి ఫైర్‌

-

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీని స్వర్ణాంధ ప్రదేశ్‌గా కాదు.. చెత్తాంధ్ర ప్రదేశ్‌గా మారుస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షులు గౌతంరెడ్డి విమర్శలు గుప్పించారు. తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జీవో 279 వెంటనే రద్దు చెయ్యాలనే కార్మికుల డిమాండ్‌పై చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని అన్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయినా చంద్ర‌బాబు తీరు మారదా అని ప్ర‌శ్నించారు.

గంటాకు బేరం కుద‌ర‌కే డిఎస్సీ వాయిదా

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకి బేరం కుదరలేదు కాబట్టే డీఎస్సీని మళ్లీ వాయిదా వేశారని గౌతంరెడ్డి ఆరోపించారు. ఆశ వర్కర్లను ప్రభుత్వం చులకన గా చూస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకి కనీస వేతనం పదివేల రూపాయల ఇవ్వాలనే తమకు సమస్యను లేవనెత్తడం నేరమా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కారానికి మద్దతు కోరుతూ ప్రతిపక్ష నాయకుడు వద్దకు వెళ్లిన విశాఖ జిల్లాకు చెందిన 9 మంది ఉపాధ్యాయుల‌ను సస్పెండ్ చెయ్యటం దారుణమని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version